సారంగాపూర్, సెప్టెంబర్ 7: బీరవెల్లి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. బీరవెల్లి కేంద్రంగా ప్యారమూర్, వంజర్, తాండ్ర(జీ), వైకుంఠ పూర్, కంకెట, మల్లక్చించోలి, జెవుళి, కాల్వ గ్రామాలను కలిపి కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రామాలు ఇప్పటివరకు సారంగాపూర్ మండలంలో ఉం డేవి. వారు వివిధ పనుల కోసం సారంగాపూర్కు వెళ్లేందుకు దూ ర భారంతో ఇబ్బందులు పడేవారు.
తమ గ్రామాలకు సమీపంగా మం డల కేంద్రం ఏర్పాటు కావడంతో కష్టాలు తీరినట్లేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డికి కృ తజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీపీ అట్ల మహిపాల్రె డ్డి, బీఆ ర్ఎస్ మండలాధ్యక్షుడు కొత్తపెల్లి మాధవరావు, సర్పం చ్ల సంఘం అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, నాయకులు కరుణాసా గర్ రెడ్డి, శేఖర్, భూమారెడ్డి, రాజు మంత్రి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.