ఇచ్చోడ, ఆగస్టు 24: ఎత్తైన గుట్టలు… పక్కనే మిషన్ కాకతీయ చెరువు.. పక్షుల కిలకిలరావాలు.. వీటి మధ్య పల్లె పార్కు చూడముచ్చటగా ఉంది. వివిధ రకాల రంగు రంగుల పూల మొక్కలు, చెట్లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా సౌకర్యాలు.. చిన్న చిన్న రాళ్లతో ఆకర్షణీయంగా గీసిన చిత్రాలు, ఆట వస్తువులు, వన్య ప్రాణుల ప్రతిమలు, పండ్ల మొక్కలతో అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇచ్చోడ తండా సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రకృతి వనం సిటీ పార్కును తలపిస్తోంది.
పాలక వర్గం…ప్రజాప్రతినిధుల కృషితో…
మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, స్థానిక ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, పాలక వర్గం, పంచాయతీ సిబ్బంది కృషితో పల్లె ప్రకృతి వనం అ ద్భుతంగా తయారైంది. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జి ల్లా, మండల ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఇచ్చోడ జీ పీకి రెండున్నర కిలో మీటర్ల దూరంలో సుమారు ఎకరన్నర స్థలంలో రూ. 5 లక్షల నిధులతో ప్రకృతి వ నాన్ని ఏర్పాటు చేశారు. నిధులు సరిపోకపోవడంతో జీపీ ని ధులు రూ. 8 లక్షలు వెచ్చించారు.
పర్యాటకుల సందర్శన కోసం చక్కని రోడ్డును నిర్మించారు. పార్కులో మొక్కల సం రక్షణ కోసం చుట్టూ ఐదు ఫీట్ల ఎత్తుతో జాలీ కంచెను ఏ ర్పాటు చేశారు. ప్రత్యేకంగా బోరుబావిని తవ్వించి, అం డర్గ్రౌండ్ పైప్లైన్ ద్వారా చెట్లకు నీటిని అందిస్తున్నా రు. హైదరాబాద్ నుంచి మామిడి, జామ, అల్లనేరేడు, కొబ్బరి మొక్కలు తీసుకువచ్చి నాటారు. రా త్రి వేళలో సుందరంగా కనిపించేలా మధ్యలో రెండు స్తంభాలకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశా రు. ప్రత్యేకంగా వాచ్మన్ను నియమించారు. వేసవి తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి చిన్నారులు, యువతీయువకులు తరలివస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు.