మంచిర్యాల అర్బన్, మార్చి 4 : విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఇందుకు ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఇవ్వగా, ఆపై అర్హత, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నది. కోర్సుల్లో చేరబోయే వారికి రూ. 20 లక్షల చొప్పున సాయమందించడంతో పాటు వీసా ఖర్చులను సైతం భరించనున్నది.
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అవకాశం కల్పిస్తున్నది.
ఈ నెల 8లోగా దరఖాస్తులకు అవకాశం
ఈ నెల 8వ తేదీలోగా ఆన్లైన్ (www.telangana epass.cgg.gov.in)లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అభ్యర్థుల వివరాలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలో చైర్మన్గా ఆయా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు. సభ్యులుగా ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కౌన్సిల్ కార్యదర్శి, వైస్ చాన్స్లర్ జేఎన్టీయూ, కమిషనర్ ఎస్సీ డీడీ, కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఉంటారు. విద్యార్థుల అర్హత, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి విచారణ చేపట్టి డబ్బులు మంజూరు చేస్తారు.
రూ. 20 లక్షలు మంజూరు
విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికైన విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ రూ. 20 లక్షలు అందించనున్నది. అవి వీసా వచ్చిన తర్వాత రూ. 10 లక్షలు, రెండో సంవత్సరం ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షలు చెల్లించనున్నది. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి వడ్డీ ధరల ప్రకారం అదనంగా రూ. 10 లక్షల విద్యారుణం తీసుకోవచ్చు. విమాన టికెట్కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది.
ఏయే దేశాల్లో అంటే…
యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగాపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో చదివేందుకు అవకాశముంది. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, స్వచ్ఛ సైన్స్, వ్యవసాయ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్స్ తదితర విభాగాలలో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరే వారికి అవకాశం కల్పించారు.
కుటుంబంలో ఒకరికే అవకాశం
ఈ పథకం కింద కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తారు. ఇదే విషయాన్ని సంబంధిత లబ్ధిదారుడి తల్లిదండ్రులు ఒప్పందపత్రం రాసివ్వాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి స్కాలర్షిప్తో పాటు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి విద్యా రుణం పొందవచ్చు. చదువు కొనసాగిస్తూ తాత్కాలిక పరిశోధనలు, సహాయ బోధకులుగా పని చేసే అవకాశం కల్పిస్తారు.
వీసా ఖర్చులు సైతం ప్రభుత్వమే భరిస్తుంది
యూనివర్సిటీలో సీటు పొందిన సంవత్సరంలోగా చేరకుంటే పథకాన్ని రద్దు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని పొడిగించరు. ఏ కోర్సు కోసం ఉపకార వేతనాన్ని పొందుతారో అందులోనే కొనసాగాల్సి ఉంటుంది. వీసాకు అయ్యే ఖర్చులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోర్సు కాలం పూర్తయ్యే వరకు మాత్రమే వీసా అనుమతి ఉంటుంది. అనంతరం దేశానికి తిరిగి వచ్చేలా అంగీకరిస్తేనే ఉపకార వేతనం మంజూరవుతుంది.
– వినోద్కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, మంచిర్యాల
అర్హతలు ఇవే…
జత చేయాల్సినవి ఇవే..