తాండూర్ : యూరియా బుకింగ్ యాప్ ( Urea App ) పై రైతులు అవగాహన కలిగి ఉండాలని తాండూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి కే సుష్మ ( Susma ) అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు. యూరియా కోసం రైతులు ఇంట్లో కూర్చొని ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను డౌన్ లోడ్ చేసుకొని యూరియా సంచులను బుక్ చేసుకోవచ్చన్నారు.
ప్రతి రైతు ప్రస్తుతం జిల్లాలోని అన్ని షాప్లలో బుక్ చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. యూరియా బుకింగ్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ విస్తరణ అధికారులను గానీ, డీలర్స్ గానీ సంప్రదించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శంకర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.