ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి
పాల శీతలీకరణ కేంద్రానికి భూమిపూజ
కుంటాల, ఫిబ్రవరి, 6 : ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలం కల్లూర్ గ్రామంలో రూర్బన్ మిషన్ పథకం ద్వారా రూ.8లక్షలతో నిర్మించనున్న పాల శీతలీకరణ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ఏర్పాటుతో కల్లూర్, కుంటాల, నర్సాపూర్, లోకేశ్వరం, భైంసా మండలాల పాడి రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. విజయ తెలంగాణ పాల శీతలీకరణ యూనిట్ ఏర్పాటుతో పాల సేకరణ, ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతాయన్నారు. అనంతరం మార్కండేయ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలీ కులస్తులు, గ్రామస్తులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌదరి పద్మబాయి, ఎంపీపీ గజ్జారాం, వైస్ఎంపీపీ మౌనిక, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ప్రవీణ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, డీపీఎం జాకీర్, డెయిరీ మేనేజర్ సాయన్న, డీడీ మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
క్రికెట్ పోటీలు ప్రారంభం
కుంటాల మండలం కల్లూర్ గ్రామంలో యువకులు ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. టోర్నీ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
లోకేశ్వరం, ఫిబ్రవరి 6 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, పింఛన్లు అందిస్తామన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి భారం కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 1,00,116 అందజేయడంతో ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ శ్యాంసుందర్, వైస్ఎంపీపీ నారాయణ రెడ్డి, నయాబ్ తహసీల్దార్ అశోక్, నాయకులు భోజన్న, రాజేశ్బాబు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు భుజంగ్ రావు, ప్రశాంత్, గంగయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.