“నేను సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్న. ప్రధానంగా నిర్మల్వాసులతో ఉన్న అనుబంధం విడదీయ లేనిది. ఇప్పటివరకు కూడా వారి మద్దతుతోనే విజయం సాధిస్తున్నా. ఇంకముందు కూడా వారు ఆశీర్వ దిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్తో మాట్లాడి ప్రగతిని పరుగులు పెట్టిస్తా. యువత ఉద్యోగాల కోసం ఐటీ హబ్, జిల్లాకేం ద్రంలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలు, స్వర్ణకాలువ లైనింగ్ పనులు చేపడుతాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి నయా పైసా ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయి. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తోంది.. కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామనే నమ్మకం ఉంది.’ అని మంత్రి, నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ‘నమస్తే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
నిర్మల్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : ‘నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి అండదండలతో తాను మరోసారి గెలుస్తా. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అడిగినన్నీ నిధులు కేటాయించారు. నిర్మల్ ప్రజలతో తనకు సుదీర్ఘకాలం నుంచి ఉన్న అనుబంధమే తన గెలుపునకు నాంది కానునుంది. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాన్ని పొందేందుకు దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రజలు వీటిని నమ్మరు. ప్రతి గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయం’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం మరోసారి నిర్మల్ టికెట్ను కేటాయించిన సందర్భంగా మంత్రి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 119 స్థానాల్లో 115 మందికి ఒకేరోజు టికెట్లు ప్రకటించడమనేది ఒక చరిత్ర. తనకు కూడా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. అందుకే 115 మందికి ఒకేసారి టికెట్లు ఇవ్వడంతో ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ సంబురాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులందరూ గెలుస్తారు అనడానికి ఇదే నిదర్శనం.
మంత్రి : గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చా. నిర్మల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం సుమారు.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చవుతోంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేసారి అండర్ గ్రౌండ్ నిర్మాణాన్ని చేపడదామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ పనులను పూర్తి చేస్తా. అలాగే రైల్వే లైన్ కూడా రావాల్సి ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని రైల్వేలైన్ విషయంలో జాప్యం చేస్తున్నది. ఆర్మూర్-ఆదిలాబాద్ సర్వే పూర్తయింది. రైల్వే శాఖ పనులు మొదలు పెడితే రాష్ట్ర వాటా కింద 50 శాతం నిధులు ఇవ్వడానికి సీఎం అంగీకరించారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావద్దన్న దురుద్దేశంతోనే కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నది. మిగతా అన్ని హామీలు నెరవేర్చినా. హామీ ఇవ్వని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్నం. ఇవే 200 శాతం గెలిపిస్తాయ్.
మంత్రి : ఇప్పటికే నిర్మల్ జిల్లాలో నూతన కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన పనులు పూర్తి చేస్తాం. ప్రధానంగా రూ.20 కోట్ల అంచనాలతో స్వర్ణ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన బన్సపెల్లి, ముజ్గి, దిలావర్పూర్, కంజర్, లోలం గ్రామాలకు రూ.90 కోట్ల అంచనాలతో ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు రూపొందించాం. నిర్మల్ పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
మంత్రి : మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న మహేశ్వర్రెడ్డి బీజేపీలో చేరిండు. బీఆర్ఎస్లో ఉన్న శ్రీహరిరావు కాంగ్రెస్లోకి వెళ్లిండు. మాకు ఎదుటి పార్టీలతో ఎలాంటి ఇబ్బంది లేదు. మేము తొమ్మిదేండ్ల కాలంలో వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినం. అభివృద్ధి పనులను చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారా నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి నయా పైసా రాలేదు. రేపు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ను మరిచిపోయి చాలా ఏళ్లవుతోంది. ప్రతిపక్షాలకు ఓటడిగే నైతిక హక్కు లేదు. ఈ రెండు పార్టీలపై ప్రజల్లో విశ్వాసం లేదు.
మంత్రి : అక్టోబర్ 16న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. కొత్త మేనిఫెస్టోలో మరిన్ని ప్రగతి పథకాలను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ లోపు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఏమైనా మా దృష్టికి వస్తే వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చి ప్రజల్లో విశ్వాసం కల్పిస్తాం.
మంత్రి : నిరుద్యోగుల కోసం ఇక్కడ ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలవడం జరిగింది. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. తొందరలోనే ఐటీ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
మంత్రి : ముందుగా అనుమతి లేకుండా లే అవుట్లు చేసి అమాయక ప్రజలకు ప్లాట్లను విక్రయించే వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. బఫర్ జోన్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకోవడం వల్ల ఈ సమస్య వస్తున్నది. ప్లాట్లు కొనుగోలు చేసేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. జీఎన్ఆర్ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నరు. భారీ వర్షాలు కురిసిన ప్రతి సారి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వస్తున్నది. రాబోయే రోజుల్లో అటువంటి ప్రాంతాల్లో కరకట్టలు కట్టి ముంపుకు గురికాకుండా చర్యలు చేపడుతాం. మళ్లీ మూడోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తాం. ప్రజలకు ఏది చేయాలన్న అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోంది. నిర్మల్ ప్రజలు మళ్లీ నన్నే ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది.