భీమారం, ఏప్రిల్ 17 : ఇప్పల బోగుడ సమీపంలో గతేడాది రూ.3 కోట్ల పనులకు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో మండలంలో గందరగోళ పరిస్థితి నెలకున్నది. ధ్వంసం చేసే సంస్కృతి ఎంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.