నిర్మల్ అర్బన్, నవంబర్ 23 : విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో బుధవారం నుంచి మూడ్రోజులపాటు నిర్వహించే సైన్స్ ఫెయిర్కు సర్వం సిద్ధమైంది. జిల్లా విద్యాశాఖ ఆ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసింది. కార్యక్రమాన్ని రాష్ట్ర శాస్త్ర సాంకేతిక, అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నా రు. ఈ మేరకు నాలుగు రోజులుగా డీఈవో రవీందర్రెడ్డితో పాటు, కమిటీల సభ్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడే సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మేళా నిర్వహించనున్నారు.
ఇందులో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన సైన్స్ఫెయిర్తో పాటు, 2020-21 విద్యాసంవత్సరపు ఇన్స్పైర్ ప్రదర్శలను ప్రదర్శించనున్నారు. ఈ వే డుకలను విజయవంతం చేసేందుకు 19 కమిటీలను వేసి, ఒక్కో అంశానికి ఒక్కో కమిటీకి బాధ్యతలు అప్పజెప్పారు. ప్రారంభోత్సవానికి మంత్రితో పాటు, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎంపీ సోయం బాపు రావ్, ఎమ్మెల్సీ దండె విఠ ల్, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ హాజరుకానున్నారు.
సైన్స్ ఫెయిర్కు 400.. ఇన్స్పైర్కు 167 ప్రదర్శలు..
సైన్స్ఫెయిర్కు జూనియర్, సీనియర్ విభాగాల వారీగా మొత్తం 400 ప్రదర్శనలు రానున్నాయని అధికారులు తెలిపారు. అందుకు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి కనీసం 5 ప్రాజెక్టులను తీసుకువచ్చేలా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన మొత్తం 14 ప్రదర్శలను (జూనియర్ 7, సీనియర్ 7) రాష్ట్రస్థాయికి.., అక్కడ ప్రతిభ చూపిన ప్రదర్శనలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు.
అలాగే 2020-21 విద్యాసంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మొత్తం 1200 ప్రదర్శనలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. అత్యత్తమ ప్రదర్శనలో నిర్మల్ జిల్లా నుంచి 167 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటిని సైతం ఇక్కడే ప్రదర్శించనున్నారు. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసేందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సభ్యులు (పశ్చిమ బెంగాల్కు చెందిన) శుభంకర్ రానున్నారు. అత్యుత్తమ ప్రదర్శనగా 10-12 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మేళాకు పంపనున్నారు. అక్కడ ప్రతిభ కనబర్చిన ప్రదర్శలను జాతీయ స్థాయికి పంపించనున్నారు.