ఎదులాపురం, సెప్టెంబర్ 15 : 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని నూతన అంబేద్కర్ భవన్లో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత, నైతిక ఓటింగ్పై విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం, ప్రాముఖ్యత తెలిసేలా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 18 యేండ్లు నిండిన యువత తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు.
ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు మిత్రు లు, బంధుపులు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా నమో దు చేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. 1, అక్టోబర్ 2023 నాటికి 18 యేండ్లు నిండి వారు తమ పేరును ఈ నెల 19లోగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పేర్లు, చిరునామా మార్పులకు సంబంధిత ఫారా లు పూరించి బీఎల్వోలకు లేదా తహసీల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. అనంతరం పోటీలో గెలుపొందిన ఉత్తమ పెయింటింగ్ వేసిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు జ్ఞాపిక, నగదు, ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు. స్వీప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, డీడీ మధుసూదన్ పాల్గొన్నారు.