నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 26 : సీపీఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది సీపీఆర్పై పోలీస్ అధికారులకు అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ ప్రవీణ్ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే ప్రథమ చికిత్స అందిం చడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలితే వెంటనే 108 అంబులెన్స్కు సమాచారమిచ్చి వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తే నిండు జీవితాన్ని కాపా డిన వారమవుతామని చెప్పారు. సీపీఆర్ చేసే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ధన్రాజ్, ఎవో వెంకట శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు, డాక్టర్లు సమతా, శ్రీనివాస్, రాజేందర్, ఆర్ఐ రామకృష్ణ, ఎంటీవో వినోద్ సిబ్బంది తదితరులున్నారు.