ఉట్నూర్ రూరల్, జూన్ 17 : గిరిజన గ్రామాల్లో గిరిజన రైతుల జీవనోపాధి మార్గాల పెంపునకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం నిర్వహించారు. మండలంలోని ఎక్స్రోడ్ లింగోజితండాలో ఐటీడీఏ పరిశ్రమల భవనంలో 500 లీటర్ల సామర్థ్యం గల పాల శీతలీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్, ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత సహకారం అందిస్తున్నదని పేర్కొన్నారు.
ఐటీడీఏ ద్వారా త్వరలో నిర్మల్లో రూ. 35 లక్షల వ్యయం తో మినరల్ మిక్చర్ ప్లాంటు ప్రారంభించనున్న ట్లు పీవో తెలిపారు. పాడి పశువుల కొనుగోలుకు ముద్ర పథకంలో ఎస్బీఐ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు డీడీ మధుసూదన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాం, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, సర్పంచ్ హరి, ఎంపీటీసి సల్గర్ రవి, జిల్లా పశువైద్యాధికారి కిషన్, మండల పశువైద్యాధికారి రాథోడ్ రమేశ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, మం డల పరిషత్ రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, నాయకులు సింగారే భారత్, కామెరి పోశన్న, రవి లక్ష్మణ్, అధికారు లు, రైతులు, ప్రజామిత్ర ప్రతినిధులు పాల్గొన్నారు.
చిన్నారులకు ఉచిత శిక్షణ అభినందనీయం
నిర్మల్ అర్బన్, జూన్ 17 : వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 55 రోజుల పాటు చిన్నారులకు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వసంతోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.అనంతరం మంత్రిని నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు, డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ ధన్రాజ్ తదితరులున్నారు.