నిర్మల్ టౌన్, అక్టోబర్ 14 : ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీకృత భవనంలో నోడల్, ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, బా ధ్యతలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు అవగాహన ర్యాలీ, పోలింగ్ బూత్ల నంబరర్లు, ఎన్నికల నియామవళి, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కలెక్టరేట్లో టోల్ఫ్రీ నంబరు 19 50ని ప్రారంభించామని , 24 గంటల పాటు అం దుబాటులో ఉంటుందని చెప్పారు. చెక్పోస్టుల వద్ద మద్యం, నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల కంట్రోల్ కార్యాలయం లో పని చేసే సిబ్బంది సమయపాలన పాటించి అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలు, అధికారులకు అందజేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకల్యాణి, జీవకరణ్, కోమల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అనుమతి తీసుకోవాలి
ప్రచార సామగ్రి, ఫ్లెక్సీల ముద్రణకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లెక్సీ, ప్రింటింగ్ ప్రెస్ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశ మందిరంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు ప్రింటింగ్ చేయించే కరపత్రాలు , గోడప్రతులు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి జిల్లా ఎన్నికల అధికారి అనుమతి పొందాలని, లేకుండా ముద్రిస్తే నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచురణలపై ప్రింటింగ్ ప్రెస్ పేరు , చిరునామా , సెల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థుల ప్రచారం కోసం గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు వంటి వాటికి , సభలు, సమావేశాలు, వాహన ర్యాలీలకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. అలాగే దినపత్రికలు, వివిధ న్యూస్ చాన ల్స్, సోషల్ మీడియాలో ప్రకటనలకు మీడియా సర్టిపికేషన్ ,మానిటరింగ్ కమిటీ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగించే వివిధ వస్తువులు, సామగ్రి రేట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి నిర్ణయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మోహతో, ఫ్లెక్సీ ,ప్రింటింగ్ ప్రెస్ ,రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.