బేల, మార్చి 23 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తూ అభ్యున్నతి బాటలో నడిచేలా కృషి చేస్తే నాయకులకు మంచి గుర్తింపు వస్తుందని బేల ఎంపీపీ వనితాఠాక్రే అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అవార్డులకు ఎంపికైన 14 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులను శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, ఆరోగ్యం, పిల్లలతో స్నేహాపూర్వకం, నీటి వనరుల లభ్యత, పచ్చదనం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, సామజిక భద్రత, సుపరిపాలన, మహిళల భద్రత వంటి తొమ్మిది విభాగాల్లో ఉత్తమంగా నిలిచిన గ్రామాలు అవార్డులు సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేందర్ కుమార్, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్పవార్, బేల సర్పంచ్ ఇంద్రశేఖర్, ఎంపీవో సమీర్ హైమద్, నాయకులు బండి సుదర్శన్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నార్నూర్, మార్చి 23 : పాలకవర్గం సమన్వయంతో గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ కనక మోతుబాయి అన్నారు. జాతీయ పంచాయతీ అవార్డుల విభాగంలో ఎంపికైన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను మండల పరిషత్ కార్యాలయంలో శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల స్థాయికి 12, జిల్లా స్థాయికి గుంజాల, మలంగి, మహగావ్, గంగాపూర్ పంచాయతీలు ఎంపిక కావడం చాలాగర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కావల రమేశ్, ఎంపీవో స్వప్నశీల పాల్గొన్నారు.
బోథ్, మార్చి 23 : గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో 16 గ్రామ పంచాయతీలకు వివిధ విభాగాల్లో వచ్చిన ప్రశంసాపత్రాలను సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 16 జీపీలకు 27 అవార్డులు దక్కడం పని తీరుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి జీవన్రెడ్డి, ఈజీఎస్ ఏపీవో జగ్దేరావు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, మార్చి 23 : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జయశ్రీ దీన్దయాళ్ ఉపాధ్యాయ ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల స్థాయి అవార్డులకు ఎంపికైన ఎనిమిది సర్పంచ్లు, కార్యదర్శులను శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాథోడ్ రాధ, ఎంపీవో మహేందర్రెడ్డి, ఏపీవో శ్రీనివాస్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, మార్చి 23 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాంప్రసాద్ వివిధ విభాగాల్లో ఉత్తమంగా నిలిచిన 13 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శులకు అవార్డు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మోహన్సింగ్, ఎంపీవో రమేశ్, ఏపీవో నరేశ్గౌడ్, ఎంపీటీసీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అమృత్రావ్ నాలుగు ఉత్తమ గ్రామ పంచాయతీలకు ఎంపికైన సర్పంచ్లకు అవార్డులు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేశ్, ఏపీవో అతుల్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, మార్చి 23 : గుడిహత్నూర్ మండలంలోని 15 పంచాయతీలకు 27 అవార్డులు వచ్చాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భరత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల స్థాయి అవార్డులు అందుకున్న సర్పంచ్లు, కార్యదర్శులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బ్రహ్మానంద్, ఎంపీడీవో సునీత, ఈవోపీఆర్డీ లింగయ్య, సర్పంచ్లు తిరుమల్గౌడ్, జాదవ్ సునీత, ఎంపీటీసీ శగీర్ఖాన్, అంకతి సవిత, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, మార్చి 23 : మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీలు కుమ్ర సుధాకర్, తాటిపెల్లి రాజు, ఎంపీడీవో శ్రీనివాస్ వివిధ విభాగాల్లో ఉత్తమంగా నిలిచిన కరంజి(టీ), నిపాని, భీంపూర్, పిప్పల్కోటి గ్రామ పంచాయతీల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసాపత్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్లు స్వాతిక, తాటిపెల్లి లావణ్య, మడావి లింబాజీ, కేమ రాజన్న, కేమ కల్యాణి, ఎంపీవో వినోద్, నాయకులు నరేందర్ యాదవ్ కుడిమెత సంతోష్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, మార్చి 23 : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో జిల్లా స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా ఎంపికైన జాదవ్ లఖన్సింగ్, మండల స్థాయిలో ఎంపికైన సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులను మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు శాలువాలతో సన్మానించి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శోభాబాయి, జడ్పీటీసీ పుష్పలత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీడీవో వేణు, మండల కోఆప్షన్ సభ్యుడు జిలానిబేగ్, ఎంపీవో సంతోష్కుమార్, ఎంపీటీసీలు ,సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.