సారంగాపూర్, జూలై 17: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల హాజరుపై వి ద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా మంది ఉ పాధ్యాయులు ఎలాంటి సెలవుల కోసం దరఖాస్తు చేయకుండా దీర్ఘకాలం అనధికారికంగా గైర్హాజరవుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో హాజరుపై ప్ర త్యేక నిఘా పెట్టాలని విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన నెల 14తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. చెప్పకుండా విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతిపై విదేశాలకు వెళ్లిన వారు, అనారోగ్యం బారిన పడినవారు గడువు ముగిసినా విధుల్లో చేరకుండా ని ర్లక్ష్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇ లాంటి వారి విషయంలో ప్రధానోపాధ్యాయుల నుంచి ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎ లాంటి సమాచారం ఇవ్వకుండా ఉపాధ్యాయలు గైర్హాజరుతో విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతోంది. అయితే ఈ ఏడాది 2023 జనవరి నుంచి జూన్ వరకు సెలవుల వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు కచ్చితంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే నిర్మల్ జిల్లాలో 735 ప్ర భుత్వ పాఠశాలల్లో 2958 మంది ఉపాధ్యాయు లు పని చేయాల్సి ఉండగా 2421 మంది పని చేస్తున్నారు. 537 మంది ఉపాధ్యాయుల పో స్టులు ఖాళీగా ఉన్నాయి.
కాంప్లెక్స్ హెచ్ఎంలకు బాధ్యతలు..
ఉపాధ్యాయుల సెలవుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే బాధ్యతలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. ప్రతి 10-15 పాఠశాలలను పర్యవేక్షణ చేసేందు కు ఇప్పటికే కాంప్లెక్స్ పాఠశాల హెచ్ఎంలకు బా ధ్యతలు అప్పగించారు. కాంపెక్స్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సెలవుల వివరాలను హెచ్ఎంల నుంచి తీసుకొని ప్రతి నెల 5తేదీలోగా ఆన్లైన్ నమోదు చేయనున్నారు. సెలవుల రిజిస్టర్ను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఆన్లైన్లో నమోద చేయాలని ఆదేశించారు. ప్రతి ఉపాధ్యాయుడు ఏ నెలలో ఎన్ని సీఎల్స్, ఎస్సీఎ ల్, చైల్డ్కేర్, మెడికల్, హెచ్ఎల్, ఓడీ, ఈఓఎల్, మెటర్నరీ తదితర లీవ్లు వినియోగించుకున్నారో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలా చర్య లు తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో ఉపాధ్యాయుల అనధికారిక గైర్హాజరుకు బ్రేక్ పడనుంది. అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడితే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చ ర్యలు తీసుకుంటామని డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులకు లైవ్లోకేషన్ కా ర్యక్రమం కొనసాగుతున్నదని చెప్పారు.