తెలంగాణచౌక్, డిసెంబర్ 30 : కరీంనగర్ జోన్ పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్ మేనేజర్లతో శనివారం జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రీజియన్ పరిధిలోని ప్రతి డిపోల వారీగా ఆదాయ, వ్యయాలను పరిశీలించారు. ఆర్థికంగా లాభాల పురోగతిని సాధించని డిపో మేనేజర్లకు తగు సూచనలు చేశారు. ప్రతి రూట్లో లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణిలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి గమ్య స్థానం చేరే వరకు డిపో మేనేజర్లు పర్యవేక్షించాలనిఆదేశించారు. శీతాకాలంలో పొగ మంచు వలన ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. బస్స్టేషన్ పరిశుభ్రంగా ఉంచి, ప్రయాణికుల ఎలాంటి అసౌకర్యలు కలుగకుండా చూడలన్నారు. ఆర్టీసీ ప్రయాణికుల కోసం తీసుకువచ్చిన స్కీంల గురించి ప్రచారం చేయాలన్నారు. కోల్ టూరిజం కోసం హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా వెళ్తున్న సింగరేణి సదర్శన్ బస్సు విస్తృతంగా ప్రచారం చేసి, ప్రయాణికుల సంఖ్య పెంచాలన్నారు. తక్కువ చార్జీలతో సింగరేణి బొగ్గు గనులు, జైపూర్ విద్యుత్ ప్లాంట్ తిలకించే అవశకాన్ని విద్యార్థులు, పర్యాటక ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న సంక్రాంతి పండుగ పుర్కరించుకొని హైదరాబాద్తో పాటు జోన్ పరిధి నుంచి కూడ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే బస్సుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సమావేశంలో నిజామాబాద్ ఆర్ఎం ఉషాదేవి, ఖమ్మం ఆర్ఎం ప్రభులత, వరంగల్ ఆర్ఎం శ్రీలత, ఆదిలాబాద్ ఆర్ఎం జానిరెడ్డితో పాటు కరీంనగర్ డిప్యూటీ ఆర్ఎం చందరావు, పర్సనల్ మేనేజర్ చంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.