లోకేశ్వరం, జనవరి, 29 : గౌతమ బుద్ధుడి బోధనలు ఆచరణీయమని డాక్టర్ భీంరావ్ యశ్వంత్ రావు అంబేద్కర్ అన్నారు. మండలంలోని కనకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 25 అడుగుల భగవాన్ బుద్ధ మూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బౌద్ధమతం ప్రజ్ఞ, కరుణ, సమతలను బోధిస్తుందన్నారు. ఇంతటి మహాకార్యానికి శ్రీకారం చుట్టిన గ్రామవాసులకు, అందుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ.. మానవాళికి శాంతి సందేశం అందించిన శాంతి దూత గౌతమ బుద్ధుడు అని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంబేద్కర్ మనవడు డాక్టర్ భీంరావ్ అంబేద్కర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమత సుదర్శన్, భారతీయ బౌద్ధ మత రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ గడపాలే, సర్పంచ్ నరేశ్, ఎంపీటీసీ ఇందిరా గ్రామ వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.