మంచిర్యాల అర్బన్, మార్చి 6 : గర్భిణులకు మెరుగైన వైద్యమందించాలని డీఎంహెచ్వో సుబ్బారాయుడు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మంచిర్యాలలోని మతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక్కడికి వచ్చే గర్భిణులు పుట్టింటికి వచ్చిన అనుభూతి పొందేలా సేవలు అందించాలని సూచించారు. స్నేహపూర్వకంగా, మర్యాదగా మాట్లాడుతూ సలహాలు అందించాలన్నారు.
సరైన సమయంలో వారికి భోజనం, మందులు ఇవ్వాలని చెప్పారు. అనంతరం గర్భిణులతో మాట్లాడారు. అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. చాలా వరకు సాధారణ కాన్పులకే ప్రయత్నిస్తామని, తప్పని పరిస్థితుల్లోనే సిజేరియన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ నీరజ, ఎంసీహెచ్ వైద్యులు, సిబ్బంది ఉన్నారు.