మంచిర్యాల ఏసీసీ, జనవరి 24 : రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంచిర్యాల జిల్లా రవాణాశాఖ అధికారి లెక్కల కిష్టయ్య అన్నారు. బుధవారం జిల్లా రవాణాశాఖ అధికారి కార్యాలయ ఆవరణ, మంచిర్యాల లక్షెట్టిపేట రహదారిపై వాహననదారులకు ఎంవీఐలు వివేకానందరెడ్డి, రాహుల్తో కలిసి అవగాహన కల్పించారు.
బైక్పై హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్న వారికి గులాబీ పూలు అందించి అభినందించారు. అనంతరం వాహనదారులకు పలు సూచనలు చేసి స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.