మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 19: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మంచిర్యాల పట్టణం పాతమంచిర్యాలలోని మున్సిపల్ క్రీడా మైదానంలో బొలిశెట్టి హన్మంతు మెమొరియల్ క్రికెట్ టోర్నీని ఆదివారం ఎమ్మెల్యేతోపాటు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో రాణించేందుకు నైపుణ్యం పెంచుకోవాలన్నారు. ఇందు కోసం అవసరమైన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలను సై తం నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, ఓపెన్జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, విజయం కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
పాతమంచిర్యాలకు చెందిన సీనియర్ కాంట్రాక్టర్ బొలిశెట్టి హన్మంతు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, ఆయన కోడలు, ప్రస్తుత కౌన్సిలర్ సునీత ఈ క్రికెట్ టోర్నీని నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ టోర్నీ లో 40 జట్లు పాల్గొంటున్నాయని, విజేత జట్టుకు రూ. 60 వేల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 30 వేల నగదుతో పాటు వ్యక్తిగత ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందిస్తున్నట్లు నిర్వాహకుడు బొలిశెట్టి కిషన్ తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే , చైర్మన్లు క్రీడాకారులను పరిచయం చేసుకుని, క్రికెట్ను ఆడి అలరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీచైర్మన్ పల్లె భూమేశ్, డీసీసీబీ డైరెక్టర్ ఎర్రం తిరుపతి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, కౌన్సిలర్లు బొలిశెట్టి సునీత, హరికృష్ణ, గాదెసత్యం, బీఆర్ఎస్ నాయకులు తోట తిరుపతి, పల్ల రాజన్న, పెంట ప్రదీప్, రవీందర్రావు, తాజుద్దీన్, ఖాజామియా, సుమోహన్, జగన్మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.