మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 8 : మహిళలు మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని, ఉపాధి అవకాశాలను అందుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకటరమణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాలులో తెలంగాణ ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటి కౌన్సిల్తో మంచిర్యాల ప్రాంత మహిళలకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీసీ కో ఆర్డినేటర్ సత్యం, శిక్షణ నిర్వాహకులు యాసిన్, సుజిత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 8 : వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యత ప్రదర్శించినప్పుడే ముందుకు వెళ్లగలమని కళాశాల ప్రిన్సిపాల్ సుమతి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో కోకకోలా బెవరేజ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్వహించిన క్యాంపస్ టూ కార్పొరేట్ పేరిట నిర్వహించిన సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రాంలో ట్రైనర్ ఎండీ అబ్దుల్ కలిసి మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కే శివలీల, టాస్క్ కో ఆర్డినేటర్ టీ కవితా రాణి, కమిటీ సభ్యులు బీ దేసిపాల, జిక్రన్, సయ్యద్, శైలజ, డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థినులు తదితరులున్నారు.