సోన్, డిసెంబర్ 1 : నిర్మల్ పట్టణంలోని మంత్రి నివాస భవనంలో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి గురువారం అందించారు. సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన పీ రాహుల్కు రూ.1.50 లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో బొప్పారం సర్పంచ్ వెంకాయిగారి హరిత-శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి, యువ నాయకుడు సొన్న సతీశ్, తదితరులు పాల్గొన్నారు.