ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి
కుభీర్లో ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ
కుభీర్, సెప్టెంబర్ 21 : గాంధీజీ కన్న కలల సాకారం సీఎం కేసీఆర్కే సాధ్యమని, ఆ దిశగా తెలంగాణలోని అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలు ఆయన హయాంలో పురుడు పోసుకున్నాయని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి గుర్తు చేశారు. మండలంలోని 1261 మందికి నూతనంగా ఆసరా పింఛన్ కార్డులు మంజూరు కాగా కుభీర్లోని మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో తమ భాగస్వామ్యం ఉందని కేంద్రప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వక పోగా బాకీ పడిందని చెప్పారు. బీజేపీ నాయకుల కల్లిబొల్లి మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత కరెంటు, రైతు బీమా, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతక ముందు ఎంపీపీ, జడ్పీటీసీ, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. చౌక్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేశారు. అక్కడి నుంచి ర్యాలీగా మార్కెట్కు చేరుకున్నారు. అక్కడ ఆయా గ్రామాల నుంచి వచ్చిన మహిళలతో బతుకమ్మ స్టెప్పులేసి వారిని ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో ఎంపీపీ తూం లక్ష్మి, సర్పంచ్ పానాజీ మీరా, జడ్పీటీసీ అల్కాతాయి, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, పీఏసీఎస్ చైర్మన్ రేకుల గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందూరి సంతోష్, కోఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎన్ దత్తు గౌడ్, దొంతుల దేవీదాస్, జీ రమేశ్, పీ విజయ్కుమార్, సంజయ్ చౌహాన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, ఎంపీటీసీలు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జాతీయ సెమినార్ పోస్టర్లు విడుదల
భైంసా, సెప్టెంబర్ 22 : పట్టణంలో ఏర్పాటు చేయనున్న జాతీయ సెమినార్కు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ మాట్లాడారు. పట్టణంలో అక్టోబర్ 5న తెలంగాణ ఉన్నత విద్యామండలి సౌజన్యంతో గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సెమినార్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు పలువురు హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ బీ మధు, అధ్యాపకులు గంగాధర్, సుధాకర్, అక్తర్ రసూల్ పాల్గొన్నారు.
ప్రొసీడింగ్ కాపీ అందజేత
పట్టణంలోని అన్నాబావు సాఠే విగ్రహ ఏర్పాటుకు మంజూరైన రూ. 2.50 లక్షల ప్రొసీడింగ్ కాపీని కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం అందజేశారు. ఆయన వెంట మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మాజీ జడ్పీటీసీ ఉత్తం, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తోట రాము, సభ్యులు ఉన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను సీఎం కేసీఆర్ తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని దేగాంలో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జీవీ రమణా రావు, సర్పంచ్లు దాసరి కిషన్, మగ్గిడి దిగంబర్, సాగర్ రావు, రాజు పాల్గొన్నారు.
Distribution of in