సోన్, జూన్ 13 : ఈ ఏడాది విద్యా సంవ త్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో పుస్తకాలను మాములు ప్రింట్ తో ఇవ్వగా, ప్రస్తుతం ఆయిల్ ప్రింట్తో తయా రు చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చది వే విద్యార్థుల కోసం తెలుగు, ఇంగ్లిష్ మీడియం లో పాఠ్య పుస్తకాలను ముద్రించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన ఊరు-మన బడిలో సర్కారు పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. సర్కారు విద్యపై గ్రామాల్లోని తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థులకు పుస్తకాలతో పాటు నోటుబుక్స్, మధ్యాహ్న భోజనం, రాగి జావ అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. ఆయిల్ ప్రింట్తో తయారైన కొత్త పుస్తకాలను చూసి విద్యార్థులు సంబురపడుతున్నారు.
ఆయిల్ ప్రింట్ బుక్స్ బాగున్నాయి
నేను సోన్ జడ్పీ హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న. ప్రస్తుతం ఆయిల్ ప్రింట్తో రూపొందించిన పుస్తకాలు చాలా బాగున్నాయి. ప్రభుత్వం కొత్త తరహాలో బుక్స్ ఇస్తుండడంతో మరింత ఆసక్తి పెరుగతున్నది. ప్రైవేటు పాఠశాలల్లో ఎలాగైతే పుస్తకాలు ఉంటాయో మాకు ఇచ్చిన బుక్స్ కూడా అలాగే ఉన్నాయి. మా పాఠశాలలో అన్ని సౌకర్యాలు మెరుగయ్యాయి. ఈ ఏడాది బాగా చదివి మంచి మార్కులు సాధిస్తాను.
హర్షిక, పదో తరగతి విద్యార్థిని, సోన్