కడెం, అక్టోబర్ 13: మత్స్యకారుల జీవితాల్లో మ రిన్ని వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. 2016 నుంచి ఇప్పటివరకు వందశాతం రాయితీపై చేప పిల్లలను అందిస్తూ వారి వృత్తిని మరింత ప్రోత్సహిస్తున్నది. కడెం మండలకేంద్రంలో మత్స్యాభివృద్ధి కార్యాలయం నుంచి నిర్మల్ జిల్లాలోని పలు పలు మండలాలు, గ్రామాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎఫ్డీవో సుమలత ఆధ్వర్యంలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే కడెం మండలకేంద్రంలోని ప్రాజెక్టు సమీపాన ఉన్న ఈ కార్యాలయం 15 ఎకరాల్లో ఉంది. ఇందులోనే బిడ్స్ ఏర్పాటు చేసి వాటిలో పిల్లలను పెంచుతారు. అయితే ఇవి 2.5 మిల్లీమీటర్ల సైజ్కు రాగానే సొసైటీ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన చెరువులు, కుంటలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలోని ఆయా గ్రామాలకు పంపిణీ చేశారు.
అవసరమైన చెరువులకు సొసైటీ సభ్యులు ఇక్కడికి వచ్చి వారి చెరువు డిమాండ్కు తగినన్ని అందించాలని కోరితే ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్ర మంలో ఇప్పటికే ఇక్కడి నుంచి 2.36 వేల రా హు, బొచ్చే రకాలకు చెందిన చేప పిల్లలను అం దించారు. అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అందించిన పిల్లలతో పాటు, అవసరమైన సొసైటీ సభ్యులు కడెం మత్స్యాభివృద్ధి సంస్థ కార్యాలయానికి వచ్చి వారి అవసరం మేర కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. యేటా సర్కారు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల ఉత్పత్తి పెరిగి, మత్స్యకారులు మంచి లాభాలు పొందుతున్నారు. ఇక్కడ అవసరమైన డిమాండ్కు విక్రయించడంతో పాటు, అనంతరం ఇక్కడి చేపలను మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, డిల్లీ, పశ్చిమబెంగాల్, చత్తీస్గఢ్, అసోం వంటి రాష్ర్టాలకు చేపలను తరలిస్తూ లాభాలు గడిస్తున్నారు. మత్స్య సంపద వృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తయారైంది. నీటి వనరులు పుష్కలంగా పెరిగి కుంటలు, చెరువుల్లో ఏడాది పొడవున నీళ్లు అందుబాటులో ఉండడంతో మత్స్యకారులకు ఏడాది పాటు మెరుగైన ఉపాధి దొరుకుతుంది. దీనికి తోడు ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లల పంపిణీతో పాటు, రుణాలు, మార్కెటింగ్ సదుపాయం, సమీకృత చేపల మార్కెట్, బీమా, ప్రత్యేక వాహనాలు, శిక్షణ ప్రోత్సాహంతో వారి కుటుంబాల్లో మరింత వెలుగులు నిండుతున్నాయి.
ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలోని ఇప్పటికే 2.36 వేల చేప పిల్లలను ఆయా చెరువుల్లో పంపిణీ చేసినం. అయితే ఈ ఏడాది వర్షాల ఆలస్యం కారణంగా పిల్లల పెంపకం ఆ లస్యం అయ్యింది. దీంతో పంపిణీ కాస్తా ఆలస్యమైనప్పటికీ అవసరమైన అన్ని సొసైటీలకు పంపిణీ చేశాం. ఇంకా అవసరమైన వారికి కూ డ పంపిణీ చేస్తాం. దరఖాస్తు చేసుకున్న వారు వాహనంతో కార్యాలయానికి వస్తే అందిస్తాం.