కౌటాల, మార్చి 4 : కేసీఆర్ సర్కారు తెలంగాణ -మహారాష్ట్ర రాష్ర్టాలను అనుసంధానం చేస్తూ వార్ధా నదిపై వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు కౌటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వెంటనే వంతెన నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దారు పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.