మంచిర్యాల అర్బన్, మార్చి 7 : విద్యార్థులు సైబర్ క్రైం భారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైం సెక్యురిటీ మీద అవగాహన సదస్సు, మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం మహిళా అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రాజు, ప్రిన్సిపాల్ పీ ఉపేందర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, డైరెక్టర్ ఎం విజయ్కుమార్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.