నార్నూర్, అక్టోబర్ 26 : ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతిరూపం దండారీ ఉత్సవాలు అని ఎంపీపీ కనక మోతుబాయి అన్నారు. మండలంలోని ఎంపల్లి గ్రా మంలో బుధవారం నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఎంపీపీ పాల్గొన్నారు. ఆమెకు ఆదివాసీలు,గుస్సాడీలు, మహిళలు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్యాలను తిలకించారు. అనంతరం దండారీ నిర్వాహకులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10వేల విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ఆదివాసీ గిరిజన పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. అంతకుముందు ఏత్మాసూర్ పేన్కు ప్రత్యేక పూజలు చేశారు. జైతుగూడకు చెందిన పెందోర్ తీర్థ జావెలిన్త్రోలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలువగా పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఏజెన్సీప్రాంతంలోని యువతీయువకులు చదువుతో పా టు క్రీడారంగంలో రాణించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ గోవింద్నాయక్,ఖైరదట్వా సర్పంచ్ కనక సేవంతాప్రభాకర్, మడావి జైతు,గ్రామపెద్దలు ఉన్నారు. మండలంలోని మాన్కాపూర్,గంగాపూర్, జామడ గ్రామాల్లోని దండారీలకు రూ.10వేల చొప్పున చెక్కును ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు,పాలకులు దండారీ పండుగను గుర్తించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వేడుకలకు రూ.కోటి మంజూరు చేయడం హర్షనీయమన్నారు. ఉమ్మడి జిల్లాలోని వెయ్యి దండారీ బృందాలకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏత్మా సూర్ పేన్ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ఉర్వేత రూప్దేవ్, జామాడ సర్పంచ్ మడావి ముక్తారూప్దేవ్, ఖైరదట్వా సర్పంచ్ కనక సేవంతా ప్రభాకర్,మాజీ ఎంపీపీ మెస్రం రూప్దేవ్,దండారీ నిర్వాహకులు కొట్నాక్ నానాజీ, చిక్రం భీంరావ్, రాయిసెంటర్ సార్మేడి మెస్రం దుర్గుపటేల్, ఉప సర్పంచ్ రాయిసిడాం రూప్దేవ్,మెస్రం మానిక్రావ్,మాజీ సర్పంచ్ మెస్రం మోతీరామ్,మడావి జైతు, కొట్నాక్ పవన్కుమార్ తదితరులున్నారు.
బేల, అక్టోబర్26 : మండలంలోని చంద్పెల్లిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ బుధవారం మండల నాయకులతో కలిసి దండారీలకు రూ.10 వేల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రావుత్ మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సం క్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. దండా రీ వేడుకలను గుర్తించింది సీఎం కేసీఆరేనని చెప్పారు. గిరిజనులతో కలిసి సంప్రదాయ పూజలు చేశారు. అనం తరం వారితో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అక్షిత పవార్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవర్, నాయకులు అరుణ్, మస్కేతేజ్రావ్, స్థానిక సర్పంచ్ జంగ్శౌవ్, సూపరింటెండెంట్ మహేందర్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు గొప్పవని జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ అన్నారు. మండలంలోని సుందరగిరిలో గుస్సాడీ సభ్యులకు బుధవారం రూ.10వేల విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా గుస్సాడీ బృందాలకు ప్రోత్సాహకాలు అందించలేదన్నారు. దీపావళి పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లాలోని గుస్సాడీ బృందాలకు రూ.కోటి మంజూరు చేశారని చెప్పారు. ఎంపీపీ, నాయకులు గుస్సాడీ టోపీలు ధరించి ఆడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విజయ్కుమార్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, ఐటీడీఏ డైరెక్టర్లు పెందూర్ దేవన్న, తానాజీ, సర్పంచ్ పెందూర్ మోహన్, ఎంపీటీసీ భరత్, నాయకులు రేణుకాబాయి, గేడం జగన్నాథ్ ఉన్నారు.