బాసర, జూలై 7 : బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు 500ల విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించగా 459 మంది హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన చేపూట్టారు. మొదటి రోజు క్రమ సంఖ్య ఒకటి నుంచి 500ల వరకు, ఈనెల 8న 501 నుంచి 1000 వరకు, 9న 1001 నుండి 1404 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ముందుగా బాసర గ్రామానికి చెందిన నానెం నవ్యకు మొదటి ఎంపిక పత్రాన్ని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్ కుమార్ అందజేసి అభినందనలు తెలిపారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు ఈనెల 24 వరకు క్యాంపస్లో రిపోర్టు చేయాలని సూచించారు. నూతన విద్యార్థులకు వారం పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని వివరించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, కోఆర్డినేటర్ డాక్ట్ పావని, డాక్టర్ దత్తు, సభ్యులు డాక్టర్ కుమార్, శ్రీకాంత్, అడ్మిషన్స్ కమిటీ సభ్యులు హరికృష్ణ, సునీత, కృష్ణ, సంతోష్రెడ్డి, అధ్యాపకులు, ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.