పత్తి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో సోమవారం క్వింటాలు ధర రూ.10,800 పలుకగా.. మంగళవారం ఏకంగా రూ.11,100 పలికింది. మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఖరీదుదారులు పోటీ పడ్డారు. గతంలో ఒక్క బేలు ఖరీదు రూ.45 వేల నుంచి రూ.50 వేలు పలుకగా.. ప్రస్తుతం మార్కెట్లో రూ.95 వేలు ఉందని ఖరీదుదారులు పేర్కొంటున్నారు.
– భైంసా, మార్చి 29