రైతులకు అవగాహన కల్పించాలి
మంచిర్యాల కలెక్టర్ భారతీహోళికేరి
యాజమాన్య పద్ధతుల బుక్లెట్స్, కరపత్రాల ఆవిష్కరణ
హాజీపూర్, జూన్ 10 : జిల్లాలో వానకాలం సీజన్లో పత్తి పంట సాగు విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని తన చాంబర్లో జిల్లా అటవీ అధికారి శివాణి దోంగ్రె, జిల్లా వ్యవసాయ అధికారి కల్పనతో కలిసి పత్తి పంట సాగు యాజమాన్య పద్ధతులు బుక్లెట్స్, కరపత్రాలు, గోడపత్రులను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతువేదికల ద్వారా వీటిని రైతులకు పంపిణీ చేసి పత్తి పంట సాగుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
పుస్తకం ఆవిష్కరణ
ప్రభుత్వం ప్రచురించిన తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం -2022 పుస్తకాన్ని రూ. 150 కే ప్రజలకు అందుబాటులో ఉంచామని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా అటవీ శాఖ అధికారి శివాణి డోంగ్రెతో కలిసి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం -2022 పుస్తకాన్ని శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ పుస్తకం ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, వివిధ రంగాల్లోని నిపుణులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ము ఖ్య ప్రణాళికా అధికారి కార్యాలయంలో అం దుబాటులో ఉంచామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.