శ్రీరాంపూర్, ఫిబ్రవరి 14 : శ్రీరాంపూర్ ఓసీపీలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మొగిళి శ్రీకాంత్కు తీవ్ర గాయాలై కుడికాలు కోల్పోయాడు. కార్మికుల కథనం ప్రకా రం.. ఓసీపీలో మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా.. బుధవారం తెల్లవారు జామున ఐదు గంటలకు వోల్వా డ్రైవర్ తను నడుపుతున్న వాహనాన్ని ముందున్న డంపర్కు ఢీకొట్టాడు.
దీంతో మొగిళి శ్రీకాంత్ కుడికాలు పూర్తిగా విరిగి వేరుగా పడింది. దీంతో తోటి కార్మికులు శ్రీకాంత్ను మంచిర్యాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ రామగుండం మండలం మూర్మూర్ గ్రామానికి చెందిన వాడు. కాగా రోజూ అక్కడి నుంచే వచ్చి విధులు నిర్వర్తిస్తున్నాడు.
శ్రీకాంత్కు నష్టపరిహారం చెల్లించాలని తాళ్లపల్లి, సింగాపూర్ కౌన్సిలర్ బండారి సంధ్యారాణి సుధాకర్ జీవీఆర్ సంస్థ మేనేజర్ పెంచలయ్యను డిమాండ్ చేశారు. డంపర్ ఆపరేట ర్లు, కార్మికులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు జోక్యం చేసుకొని ప్రమాదానికి గురైన శ్రీకాంత్కు పూర్తి వైద్యం అందించాలని,
కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సూచించిన మేరకు జీవీఆర్ యాజమాన్యం అంగీకరించడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కాగా.. కాంట్రాక్టు సంస్థ మట్టి తవ్వకాలు, తరలింపు పనుల్లో వాహనాల నిర్వహణలో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూ) రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్ ఆరోపించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించారు.