నిర్మల్ అర్బన్, అక్టోబర్ 14 ;‘మాది పేదల మ్యానిఫెస్టో అని, అందరికీ లబ్ధి చేకూరేలా ఉంటుందని, ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీలోని మూన్లైట్ ఫంక్షన్ హాల్లో గాజులపేట్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు అతని అనుచరగణంతో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మైనార్టీ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, యువ నాయకులు గౌతం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ పాల్గొన్నారు.