గుడిహత్నూర్, ఏప్రిల్ 30: ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలంలో ఆదివారం జంట హత్యలు కలకలం రేపింది. సీతాగొంది పంచాయతీ గర్కంపేట్ శివారులో ఒక చేనులో రెండు మృతదేహాలను ఆదివారం స్థానికులు గుర్తిం చారు. వెంటనే స్థానిక సర్పంచ్ భీంరావ్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, సీఐ నైలు, ఎస్ఐ ప్రవీణ్కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వీరి తలలపై తీవ్ర గాయాలున్నట్లు నిర్ధారించారు.
చేను సమీపంలోని బీటీ రోడ్డుపై లభించిన స్కూటీ నంబర్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. వీరిని ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్కు చెందిన మహ్మద్ రహమాన్(20), సుందరయ్యనగర్కు చెందిన వివాహిత సోన్కాంబ్లే అశ్విని(28)గా గుర్తించారు. క్లూస్టీం సిబ్బంది డాగ్స్కాడ్తో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా, అశ్వినికి భర్త రమేశ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.