మంచిర్యాల అర్బన్, మార్చి 14 : ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగియగా, విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఒకరికొకరు టాటా.. బైబై చెప్పుకుంటూ కేరింతలు కొడు తూ ముందుకు కదిలారు. ఆయా కళాశాలల నుంచి లగేజీలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరగా, కిటకిటలాడాయి. జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షలు పూర్తయ్యాయి. 6,351 (జనరల్ 5,500, వొకేషనల్ 851) మంది విద్యార్థులకుగాను 6,083 (జనరల్ 5,266, వొకేషనల్ 817) మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 268 (జనరల్ 234, వొకేషనల్ 34) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షా కేంద్రాలను డీఐఈవో శైలజ తిరిగి పరిశీలించారు.
ఆసిఫాబాద్ టౌన్,మార్చి14 : జిల్లాలోని 19 కేంద్రాల్లో 4,570 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 4,416 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,022 మంది ఉండగా, 3,900 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 548 మందికి, 516 మంది హాజరయ్యారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ కేసులు నమోదు కాలేదు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నైతం శంకర్ అభినందించారు. శుక్ర, శనివారాల్లో ఒకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ పరీక్ష జరుగుతుందని తెలిపారు.