నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 27 : స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జ యంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను గుర్తిస్తూ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, కౌన్సిలర్లు, నాయకులు, పద్మశాలీ సంఘ సభ్యులు తదితరులున్నారు.
క్లాక్ టవర్ నిర్మాణ పనుల పరిశీలన
నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం పక్కన నిర్మిస్తున్న క్లాక్ టవర్ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ రాజు, నాయకులు పాకాల రాంచందర్, శ్రీనివాస్, మహ్మద్ ఉస్మాన్ తదితరులున్నారు.