ఆసిఫాబాద్, మార్చి4 : ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సేవలందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జిల్లాకు రాగానే మొదట కుమ్రంభీం, హైమన్డార్ఫ్ దంపతులకు నివాళులర్పించినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తి చేశానని, మొదట ఐపీఎస్గా ఎంపికై అస్సాంలో మూడేళ్లపాటు విధులు నిర్వహించానని, ఆపై ఐఏఎస్గా ఎంపికై కామారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్గా విధులు నిర్వహించానని చెప్పుకొచ్చారు. అనంతరం జీహెచ్ఎంసీలోని ఖైరాతాబాద్ జోనల్ పరిధిలో అదనపు కమిషనర్గా విధులు నిర్వహించినట్లు తెలిపారు. ఆపై జర్నలిస్టులు అడిగి ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక నిఘా పెడుతామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు.
నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్ దౌత్రేను ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, దీపక్ తివారీ, డీపీఆర్వో సంపత్, డీఆర్వో లోకేశ్వర్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు.