నిర్మల్ జిల్లాకు నూతనంగా మంజూరైన వైద్య కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం మొదటగా రాజస్థాన్కు చెందిన మృదుల్ గోయల్ అనే విద్యార్థి అడ్మిషన్ తీసుకున్నారు.
ఈయనకు కలెక్టర్ వరుణ్రెడ్డి అడ్మిషన్ పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీవీడీఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సరోజ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.