ఎదులాపురం, ఫిబ్రవరి 6 : మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026 నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీవో) కోసం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా హాజరై మార్గదర్శకాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో పీవోలు, ఏపీవోల పాత్ర అత్యంత కీలకమని పేరొన్నారు.
శిక్షణలో భాగంగా అధికారుల అవగాహనను పరీక్షించేందుకు 50 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన అధికారులకు కలెక్టర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.