ఎదులాపురం, జూలై 31: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర ప రిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల స మస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆ వెంటనే పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం శాఖల వా రీగా అధికారులతో సమీక్షించారు. పదేండ్లు దాటి న పిల్లలు, 10 ఏండ్ల నుంచి ఆధార్ అప్డేట్ చేసుకోని వారు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 15 వరకు ఆధార్ మొబై ల్ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకొనే అ వకాశం కల్పించించిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో స్ర వంతి, ఈడీఎం రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.
శిక్షణ సహాయ కలెక్టర్కు సన్మానం
శిక్షణ సహాయ కలెక్టర్ డాక్టర్ పీ .శ్రీజ ఆత్మీయ వీ డ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జి ల్లాలో ఆమె చేసిన సేవలను కలెక్టర్ రాహుల్ రా జ్ కొనియాడారు. ఆమెను శాలువా, జ్ఞాపికతో స త్కరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆ ర్డీవో స్రవంతి, తదితరులున్నారు.