ఆసిఫాబాద్, జనవరి 20 : కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుకు అయోధ్య శ్రీరాముని అక్షింతలు, ఆహ్వాన పత్రికను శ్రీ రామ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ అందజేశారు.
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ కోదండ రామాలయంలో నిర్వహించే వేడుకులకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు ఇరుకుల్ల ఆంజనేయులు, గుర్రాల వెంకన్న, కోటేశ్వర్, వేణుగోపాల్ శ్రీరాములు, రాజేశ్వర్ ఉన్నారు.
ఆసిఫాబాద్, జనవరి 20 : రెబ్బెన మండలం గంగాపూర్లో వచ్చే నెల 23 నుంచి 25వ తేదీల వరకు నిర్వహించే బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతరను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి దేవాదాయ ధర్మాదాయ, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, రెవెన్యూశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
పారిశుధ్యం, వాహనాల పారింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సౌకర్యాల ఏర్పాట్లపై చర్చించారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. జాతరలో తాతాలిక మూత్రశాలలు ఏర్పాటు చేసే విధంగా మండల పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటపతి, రెబ్బెన తహసీల్దార్ సమీర్ అహ్మద్, రెబ్బెన ఎంపీపీ జుమ్మడి సౌందర్య, జడ్పీటీసీ సంతోష్, మిషన్ భగీరథ, దేవాదాయ శాఖ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.