నస్పూర్, డిసెంబర్ 30: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తుతో ఆధార్కార్డు నకలు ప్రతిని తప్పనిసరిగా జత చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యారెంటీ పథకాలకు అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు నకలు ప్రతిని జత చేయకున్నా దరఖాస్తు తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తు ఫారాలను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.