నస్పూర్,మార్చి 2 : రాబోయే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం సహాయక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,500 ఓటర్లుగా ఉన్న పరిమితిని 1,600 పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.