నిర్మల్ టౌన్, అక్టోబర్ 21: నిర్మల్ జిల్లాలో ఓటర్లలో చైతన్యం పెం చేందుకే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వద్ద శనివారం రాత్రి డీఆర్డీఏ జిల్లా అధికారుల సమక్షంలో నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి కోలాటం చేస్తూ బతుకమ్మను ఆడారు. జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్శాతాన్ని పెంచి ప్రజ లు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్శా తం తక్కువగా నమోదవుతున్నదని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఎస్పీ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషన్ రాజు, ఏపీడీ గోవింద్రావు, గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి అంబాజీనాయక్, జిల్లా అధికారులు కిషన్, సు భాష్, ఓస ప్రసాద్, గోవింద్రావు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు మార్గదర్శకాలను పా టిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శనివారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నవంబరు 30న ఎన్నికల నిర్వహణకు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అధికారులు ఈవీఎం, వీవీప్యాట్, ఓటింట్విధానం సౌకర్యాలు,మాక్ పోలింగ్, పోస్టల్ బ్యాలెట్, తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి ప్రలాభోలాకు గురి కావొద్దని సూచించారు. పోలింగ్ సందర్భంగా ఓటరు జాబితా, మెటీరియల్ జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఈవో రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో ఓటింగ్కు వినియోగించే ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కేటాయించామని, దీనిపై రాజకీయ పార్టీలకు అవగాహన ఉండాలని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం రాజకీయపార్టీల సమక్షంలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ కేంద్రాలకు పంపిణీ చేశారు. ఈవీఎం కేంద్రాల పనితీరుపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, నాయకులు పాల్గొన్నారు.