సారంగాపూర్, మార్చి 17 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మొరం తవ్వకాలపై ఈ నెల 12వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ లో ‘మొరంపై కన్ను.. అధికారులే దన్ను’ శీర్షికన ప్రచురితమైన కథానికి జిల్లా అధికార యంత్రాంగం కదిలిం ది. కలెక్టర్ అభిలాష అభిన వ్, ఎస్పీ జానకి షర్మిలలు మంగళవారం జామ్ గ్రామ నాగమ్మ చెరువు, కర్షలగుట్టలను తనిఖీ చేశా రు.
మొరం తవ్వకాల తీరును పరిశీలించి అ నుమతులు లేకుండా, నిబంధనలకు వీరుద్ధంగా కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ తవ్వకాలను గుర్తించిన పక్షంలో అధికాలరుపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల అవసరాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు కోసం మొరం తవ్వకాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి పొందిన తరువాత మాత్రమే తవ్వకాలు చేపట్టాని సూచించారు.
కమర్షియల్గా మొరం తవ్వకాలు జరిపే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కర్షలగుట్ట అన్యాకాంత్రం అవుతున్న దృష్ట్యా ప్రభుత్వ భూమి ఎంత ఉందో సర్వే చేసి పూర్తి వివరాలు పంపాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎస్పీ జానకి షర్మిల, రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎస్ఐ శ్రీకాంత్, ఆర్ఐ నర్సయ్య, ఉపసర్పంచ్ బింగి గంగాధర్, నాయకులు కరిపె విలాస్, రాజలింగం, రాములు, మహేందర్ పాల్గొన్నారు.