మంచిర్యాల, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం, సాయంత్రం వీస్తున్న చలిగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు కురుస్తుండగా.. సాయంత్రం 7 గంటల తరువాత బ యటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మా రిన వాతావరణంతో చాలా మంది జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి చెందుతుందంటూ వస్తున్న వార్తలు జనంలో వణుకు పుట్టిస్తున్నాయి.
ఉత్తర తీరం నుంచి బలమైన గాలుల కారణంగా నాలుగైదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ నె ల మొదటి వారం నుంచే చలి వణికిస్తున్నది. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానలు ద గ్గు, జలుబు, జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పిల్లల దవాఖానల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి వాతావరణంలో వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా బయటికి రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్తున్నారు.
ఇప్పుడు వస్తున్న కరోనా వేరియంట్ జేఎ న్-1. ఇది చలి వాతావరణంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవడంతో దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న వారిలో ఆందోళన పెరిగింది. ప్రస్తుతానికి భయపడేంత పరిస్థితి ఏం లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. లక్షణాలున్న వా రు పీహెచ్సీకి వస్తే నిర్ధారణ పరీక్షలు చేస్తామ ని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి పీహెచ్సీలో రోజూ కనీసం పది పరీక్షలు చేసేందు కు ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ వేరియంట్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా పదేండ్లలోపు, 60 ఏండ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మ ల్ ప్రభుత్వ దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. 50, 100 బెడ్స్ గల ఆసుపత్రులు ఉన్న దగ్గర కూడా కరోనా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు.
జేఎన్-1 చలిలో వేగంగా వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని వై ద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మన జిల్లాలో నమోదవున్న దృష్ట్యా అలర్ట్గా వ్యవహరించాలని సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(యూ)లో బుధవారం 10.4 కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంటే.. గురువారం 6.6 డిగ్రీలకు పడిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలో గురువారం 7.5 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.
నిర్మల్ జిల్లాలోని పెంబి మండలంలో 8.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మం డలంలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల వర కూ పొగమంచు కప్పి ఉంటున్నది. ఈదురు గాలులు వీస్తుండడంతో జనం బయటికి రావాలంటే వణికిపోతున్నారు. సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే వాతావరణం చల్లగా మారిపోతున్నది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు తీవ్రమైన ఎండ ఉన్నా.. వాతావరణం చల్లగా ఉంటున్నది. ఫలితంగా వివిధ పనులపై బయటికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, గొంతు సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు.
జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లను అలర్ట్ చేశాం. ప్రతి పీహెచ్సీలో రోజుకు పది మందికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశాం. మంచిర్యాల గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవ్వరు వచ్చినా టెస్టులు చేయాలని చెప్పాం. భయపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత దూరం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం చేస్తే మంచింది. అవసరమైతే బయటికి వెళ్లొద్దు. మాస్క్ ధరించకపోతే జరిమాన విధించాలనే ఆదేశాలు ఉన్నాయి.
– సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల