మంచిర్యాల అర్బన్, మార్చి 24 : జిల్లాలో కస్టమర్లు కోరుకున్న డిజైన్లలో నాణ్యమైన బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, ప్లాటినం, రత్నాలు, వెండి ఆభరణాలను సరసమైన ధరలో అందుబాటులోకి తెచ్చామని వైభవ్ సంస్థల సీఎండీ మల్లికా రత్నకుమారి గ్రంథి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర థియేటర్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన వైభవ్ జ్యువెల్లరీని ఆదివారం డాక్టర్ విష్ణువర్ధనరావు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తొగరు సుధాకర్, వెంకట నారాయణతో క లిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం జ్యో తిప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా కస్టమర్లనుద్దేశించి సీఎండీ మాట్లాడుతూ ఇప్పటి వరకు కోస్తా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 14 బ్రాంచీలతో వైభ వ్ జ్యువెల్లరీ (మనోజ్ వైభవ్ జెమ్స్ ‘ఎన్’ జ్యూయలర్స్ లిమిటెడ్) ప్రారంభించామని,ప్రస్తుతం మంచిర్యాలలో 15వ షోరూంని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
వినియోగదారులకు 916 హాల్ మార్క్డ్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్, ఫైన్ జ్యూయలరీ, 925 స్వచ్ఛత కలిగి 100 శాతం తిరిగి కొనుగోలు హామీ గల స్టెర్లింగ్ వస్తువులు, సా ధారణ వెండి వస్తువులు, జ్యువెల్లరీని బంగారు ప్రి యులకు సరసమైన ధరలకు నాణ్యతమైనవి అందించనున్నామన్నారు.
ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సాధారణ బంగారు ఆభరణాలపై (వీఏ) తరుగు కేవలం 9 శాతం, స్టోన్ స్టడెడ్, ఏంటిక్ జ్యువెల్లరీపై గ్రాముకు రూ. 150 వరకు తగ్గింపుతోపాటు వీవీఎస్ ఈఎఫ్ నాణ్యత గల డైమండ్స్ క్యారెట్కు రూ. 60 వేలు, సాధారణ వెండి వస్తువులను తయా రీ చార్జీలు లేకుండా అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీవోవో గొంట్ల రాఖాల్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింధూరీవెంకటేశ్, ఏలూరు వైభవ్ జ్యువెల్లర్స్ ఎండీ అమరేంద్ర గ్రంధి, మార్కెటింగ్ జనరల్ మేనేజర్ రఘునాథ్, సిబ్బంది పాల్గొన్నారు.