మంచిర్యాల ఏసీసీ/కోటపల్లి/వాంకిడి, జనవరి 29 : మంచిర్యాల జిల్లా నుంచి ఎంపికైన 266 మంది స్టాఫ్ నర్సులకు సోమవారం డీఎంహెచ్వో కార్యాలయంలో ఐడీ కార్డులు, పాస్లను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు, కార్యాలయ సూపరింటెండెంట్ విశ్వశ్వర్రావు, డెమె వెంకటేశ్వర్లు అందజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 31న హైదరాబాద్లోని లాల్బహుదూర్ స్టేడియం లో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు.
కాగా, కోటపల్లి చెందిన కొట్టె శ్రావ్య, మల్లంపేటకు చెందిన సుందిళ్ళ శశికళ, నక్కలపల్లికి చెందిన సీహెచ్ మహేశ్, సూపాక గ్రామానికి చెందిన నల్లగుంట శ్రావణి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలానికి చెందిన కొదురూపక లావణ్య, సునీతతో పాటు మరో ఇద్దరు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు సాధించారు.