నార్నూర్ : గ్రామస్వరాజ్యం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అరిహ్నశలు కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు గాంధీ జయంతిని పురష్క రించుకుని మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్ అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు,అభివృద్ధి మన రాష్ట్రంలోనే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమూచిత న్యాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్ వంటి పథకాలు ప్రతి కుటుంబంలో వెలుగు నిలుస్తున్నాయని వివరించారు.
75ఏళ్లలో జరగని ప్రగతి ఏడేళ్లలోనే కనిపిస్తుందన్నారు. అనంతరం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అంతకుముందు మండలకేంద్రంలోని గాంధీచౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, ఐకేపీ ఏపీఎం రమేశ్, ఎంపీటీసీ టీ.పరమేశ్వర్, నార్నూర్ సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఉప సర్పంచ్ హన్ మహేందర్, జీవవైవిద్యా కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుపతి, భీంపూర్ సర్పంచ్ రాథోడ్ విష్ణు, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి,వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు,మహిళలు ఉన్నారు.