ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్ : జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి ప్రభుత్వం రూ. 10వేలు అందజేస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కుమ్రం నూరు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన దండారి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ రాల్రాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండారి ఉత్సవాల కోసం సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాకు కోటి రూపాయలు మంజురు చేశారని గుర్తుచేశారు. కలెక్టర్ రాల్రాజ్ మాట్లాడుతూ.. ఆదివాసుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు.
పిల్లల్లో పోషణ లోపం లేకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తుంద న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన శాఖ అధికారిణి మణెమ్మ, కొలం సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం , వివిధ సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.