“నిజాం సర్కారు కాలంలో సదర్మాట్ను 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్మించారు. మరో 20 వేల ఎకరాలకు నీరందించడానికి బ్యారేజ్ కట్టినం. కెనాల్కు నిధులు మంజూరు చేసినం..” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించా రు. సదర్మాట్ పైన బ్యారే జ్ కట్టిందే దాని స్థిరీకరణ కోసమని, మీ కోసమని ఉద్ఘాటించా రు. ఎలాంటి అనుమానాలు అక్కర లేదని, ఆ పని నీను చేయిస్తా. నా జిమ్మేదారి అని హామీ ఇచ్చారు.
జాన్సన్ నాయక్ నా దృష్టికి ఖానాపూర్లో డిగ్రీ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పాడన్నారు. ఈ రెండు కూడా న్యాయమైన విషయాలే తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధు రూ.16 వేలు కావాలన్నా, 24 గంటల కరెంట్ సప్లయ్ కావాలన్నా జాన్సన్ నాయక్ గెలవాలన్నారు. గతంలో కరెంట్ బాధలేంది, ఇవాళ కరెంట్ ఏ విధంగా ఉందనేది మీ కండ్ల ముందే ఉందన్నారు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని, లేకపోతే మనం దెబ్బతినే ప్రమాదం వస్తుందని సూచించారు.
– మంచిర్యాల, నవంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జాన్సన్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. దేవుడు ఆయనకు చాలా డబ్బులు ఇచ్చాడు. అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఇక్కడున్న ఎమ్మెల్యే సక్కగ లేదు. అంత పిచ్చిపిచ్చి యవ్వారం ఉంది. మాట్లాడితే వాళ్లు లంచాలు తీసుకుంటున్నరని చాలా కైంప్లెంట్స్ వస్తున్నయ్. నీలాంటి యువకులు, బుద్ధిమంతులు, చదువుకున్నోళ్లు రాజకీయాల్లోకి వస్తే లాభం జరుగుతదని నేను పిలిస్తే వచ్చాడు. ఆయనంతట ఆయన టికెట్ అడగలేదు. మీకు నిస్వార్థంగా మంచి సేవ చేస్తడు. నాలెడ్జ్ ఉన్నోడు, దేశవిదేశాలు తిరిగిన వ్యక్తి, అవగాహన ఉన్నోడు, నా కుటుంబానికి దగ్గరున్నోడు గెలిస్తే మీకు లాభం జరుగుతది.
ఖానాపూర్, నిర్మల్ వాటి చుట్టూ పక్కల ఉన్న ఐదారు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యమాని మన బిడ్డలు చాలా మంది గల్ఫ్కు పోయి బతుకుతున్నరు. మా గురించి కూడా ఆలోచించమని చాలా రోజుల నుంచి కోరుతున్నరు. తప్పకుండా ఈ గల్ఫ్కు పోయినోళ్ల బాధలేంది. ఈసారి ఆలోచించి వాళ్లకు పూర్తి సాయం చేయడానికి ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటాం.
జాన్సన్ నాయక్.. నా కొడుకు రామ్ క్లాస్మేట్. మొన్న రామ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఖానాపూర్ను దత్తత తీసుకుంటా అని చెప్పినట్లు తెలిసింది. ఇగ, రామారావు దత్తత తీసుకున్నంక మీకు ఏం తక్కువైతది. ఏం బాధ లేదు. మీరు జాన్సన్ నాయక్కు ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్లే లెక్క.
ఒక రోజు నేనే స్వయంగా రాష్ట్ర అధికారులందరినీ తీసుకొని క్యాంప్నకు వస్తా. దినమంతా ఖానాపూర్లో ఉండి ఏం పనులు అవసరం ఉన్నయో నోట్ చేసి అవన్నీ చేపిస్తా.
మంచిర్యాల, నవంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సదర్మాట్ అప్పుడున్న నిజాం సర్కార్ కట్టింది. దాన్ని ఆ రోజు బ్యారేజ్లా కట్టలే. మాములుగా ఓ 15 వేల ఎకరాలకు నీళ్లు రావాలని నిర్మించారు. ఇప్పుడు పైన కట్టిన బ్యారేజ్ సదర్మాట్ కోసమే, దాని స్పెషల్ కెనాల్ కూడా మంజూరైంది. పాత 15 వేల ఎకరాలే కాకుండా ఇంకో 20 వేల ఎకరాలకు ఎక్స్ట్రా ఆయకట్టు కూడా వస్తది మీకు. అది నా బాధ్యత. నేను చేసి పెడుతా అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వాడొకడు, వీడొకడు అడ్డం పొడుగు మాట్లాడితే దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. సదర్మాట్ పైన బ్యారేజ్ కట్టిందే దాని స్థిరీకరణ కోసమని, మీ కోసమని స్పష్టం చేశారు. దాని మీద ఎలాంటి అనుమానాలు అక్కర లేదని, ఆ పని నీను చేయిస్తా. నా జిమ్మేదారి అని సీఎం చెప్పారు. తెలంగాణ వచ్చాకే వ్యవసాయం స్థిరీకరణ జరుగుతుందన్నారు.
అన్ని రాష్ర్టాల్లో నీళ్లకు పన్ను ఉంటుందని, మన రాష్ట్రంలో నీళ్లకు రూపాయి కూడా పన్ను లేదన్నారు. సదర్మాట్ ద్వారా, కడెం ద్వారా మీకు నీళ్లు ఇస్తే నీటి తీరువా లేకుండా చేశామన్నారు. పాత బకాయిలను రద్దు చేశామని, 24 గంటలు మంచి నాణ్యమైన ఉచిత కరెంట్ను సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో కరెంట్ బాధలేంది. ఇవాళ కరెంట్ ఏ విధంగా ఉందనేది మీ కండ్ల ముందే ఉందన్నారు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని, లేకపోతే మనం దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు.
జాన్సన్ గెలిస్తే మీకు
రైతుబంధు ఉండాలంటే జాన్సన్ నాయక్ గెలవాలి. రైతుబంధు వేస్ట్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలా.. రైతుబంధు ఉండాలనే పార్టీ అభ్యర్థి జాన్సన్ గెలవాలా మీరు నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మీరు జాన్సన్ను గెలిపించండి.. ఎకరాకు రూ.10 వేలు వచ్చే రైతుబంధును రేపు రూ.16 వేలు చేస్తామన్నారు. 24 గంటల కరెంట్ సప్లయ్ కావాలంటే కూడా జాన్సన్ నాయక్ గెలవాలన్నారు. యుద్ధం నడిచేప్పుడు ఎవడైతే మన కోసం కొట్లాడుతడో వాని చేతికి కత్తి ఇవ్వాలే గానీ, కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే చేయస్తదా.. చేయగలుగుతమా.. మీరే ఆలోచించాలన్నారు.
మీరు కత్తి జాన్సన్నాయక్ చేతుల పెట్టండి రూ.16 వేల రైతుబంధు తెస్తడు. 24 గంటల కరెంట్ ఉంచుతడు. మీకు ఇబ్బంది లేకుండా చూస్తడు అని కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండు, మూడు సమస్యలు జాన్సన్ నాయక్ నా దృష్టికి తీసుకొచ్చాడని ఖానాపూర్కు డిగ్రీ కాలేజీ కావాలన్నరు. మాకు రెవెన్యూ డివిజన్ కావాలన్నడు ఈ రెండు కూడా న్యాయమైన విషయాలే అన్నారు. ఇది అడవి ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం కాబట్టి తప్పకుండా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఖానాపూర్, నిర్మల్ వాటి చుట్టూ పక్కల ఉన్న ఐదారు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యమా అని మన బిడ్డలు చాలా మంది గల్ఫ్కు పోయి బతుకుతున్నరని సీఎం కేసీఆర్ అన్నారు. మా గురించి కూడా ఆలోచించమని చాలా రోజుల నుంచి కోరుతున్నారని, తప్పకుండా ఈ గల్ఫ్కు పోయినోళ్ల బాధలేంది. ఈ సారి ఆలోచించి వాళ్లకు పూర్తి సాయం చేయడానికి ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటామన్నారు.
జాన్సన్ నా కొడుకు రామ్ క్లాస్మేట్..
జాన్సన్ నాయక్ గురించి మీకు ఎంత మందికి తెలుసో నాకు తెలియదు. కానీ ఈయన నా కొడుకు రామ్ క్లాస్మేట్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మొన్న రామ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఖానాపూర్ను నేను దత్తత తీసుకుంటా అని చెప్పినట్లు తెలిసిందన్నారు. ఇగ, రామారావు దత్తత తీసుకున్నంక మీకు ఏం తక్కువైతది.. మీకు ఏం బాధ లేదన్నారు. మీరు జాన్సన్ నాయక్కు ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్లే లెక్క అన్నారు. మంచి మెజార్టీతో జాన్సన్ నాయక్ను గెలిపియాలని చెప్పారు. జాన్సన్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, దేవుడు ఆయనకు చాలా డబ్బులు ఇచ్చారని, అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉందన్నారు.
నీ లాంటి యువకులు, చదువుకున్నోళ్లు రావాలే రాజకీయాలకు ఇక్కడున్న ఎమ్మెల్యే సక్కగ లేదు అంత పిచ్చిపిచ్చి యవ్వారం ఉంది, మాట్లాడితే వాళ్లు లంచాలు తీసుకుంటున్నరని చాలా కంప్లెంట్ వస్తున్నయ్, అందుకే చదువుకున్నోళ్లు నీలాంటి బుద్ధిమంతులు వస్తే లాభం జరుగుతుందని నేను పిలిస్తే ఆయన వచ్చారన్నారు. ఆయనంతట ఆయన టికెట్ అడగలేదని, నేను పిలిస్తే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీకు నిస్వార్థంగా మంచి సేవ జరుగుతుందన్నారు. కేటీఆర్ దత్తత తీసుకుంటే నీను తీసుకున్నట్లే కదా.. మీకు ఏం కావాలో అన్ని కూడా నిమిషాల మీద జరుగుతాయని, దానికి అనుమానం అవసరం లేదని చెప్పారు. ఒక రోజు నేనే స్వయంగా రాష్ట్ర అధికారులందరినీ తీసుకొని క్యాంప్కు వస్తానని, దినమంతా ఖానాపూర్లో ఉండి ఏం పనులు అవసరం ఉన్నయో నోట్ చేసి అవన్నీ చేపిస్తానని హామీ ఇచ్చారు.
యువకుడు, బుద్ధిమంతుడు, నాలెడ్జ్ ఉన్నోడు, దేశవిదేశాలు తిరిగిన వ్యక్తి, అవగాహన ఉన్నోడు, నా కుటుంబానికి దగ్గరున్నోడు గెలిస్తే మీకు లాభం జరుగుతదని చెప్పారు. మంచి మెజార్టీతో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తా ఉంది. కాంగ్రెస్ అంతా మటాష్. ఒట్టిదే గ్యాస్.. ఏం లేదు అంత ఒట్టిదే బొబ్బ తప్ప ఏం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, మధుసూదనాచారి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, నిర్మల్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్లు విజయలక్ష్మి, జనార్దన్ రాథోడ్, సీనియర్ నాయకులు పైడిపల్లి రవీందర్రావు, పూర్ణ చంద్రనాయక్, అంకం రాజేందర్, భూక్యా జానకీబాయ్, చారులత రాథోడ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.